ద్విపదభాగవతం - మధురకాండ : అక్రూరుఁడు ధృతరాష్ట్రునికి హితోక్తుల నుడువుట
“ధరణీశ! నీవును ధర్మచిత్తుఁడవు
భరతవంశాఢ్య! నీ ప్రతియవ్వరెందు!
పాండుభూపతి నీకుఁ బరమభక్తుండు
దండివీరుఁడు నిన్ను ధరణి యేలించె. - 500
నాతని పుత్రులకతిబలాఢ్యులకుఁ
బైతృకంబగు రాజ్యభారంబుఁ బంచి
యిచ్చిన నీకుఁ బెంపెక్కు లోకములఁ
xiiiబొచ్చంబుఁ గల్గఁ బోవుదువధోగతికి
నీపుత్రమిత్రులు నీ శరీరంబు
నీవురి యీరాజ్య మింతయుమిథ్య
మేలుఁ గీడును గడ మిమ్మెందుఁ గాని
కాలంబుచేతఁ గ్రాఁగని వారులేరు
హరి పాండుపుత్రులకాత్మబాంధవుఁడు
హరిసంతసించుట యదిలెస్స మనకు
చిత్తమేభంగియో చెప్పితి” నంత
నుత్తరంబీఁ జూచి యొమ్మనఁ బలికె
“నీవాడినన్నియు నిజమంటి, తెఱఁగుఁ
గావింతు నటదైవగతి యెట్టిదగునొ?
xivఅమృతతుల్యములు నీ వాడు వాక్యములు
కమలనాభునకు నీ క్రమ మెఱిఁగింపు”
మనిపల్కి, హరికుపాయనమిచ్చి యతనిఁ
దనరారఁ బూజించి దయవీడుకొల్ప
నరిగి పాండవులతో నంతయుఁ జెప్పి
యరయ సౌఖ్యమునొంది యక్రూరుఁ డంత. - 510